నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు గురించి తెలుసు కుందామా
శ్రీకృష్ణార్జున విజయం (1996) (పర్యవేక్షక నిర్మాత)
భైరవ ద్వీపం (1994) (పర్యవేక్షక నిర్మాత)
బృందావనం (1992 సినిమా) (1992) (పర్యవేక్షక నిర్మాత)
భైరవ ద్వీపం (1994) (సంభాషణలు)
బృందావనం (1992 సినిమా) (సంభాషణలు)
పెళ్ళి పుస్తకం (1991) (కథ)
చల్లని నీడ (1968) (రచయిత)
నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. రావి కొండల రావు దాదాపు 600 చిత్రాలలో నటించాడు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటిమణి.
రావి కొండల రావు గారి పరిచయం
- రావి కొండల రావు 1932, ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు.
- ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది.
- 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది.
- పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు.
- కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు.
- నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్లు సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది.
- కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు.
- రావి కొండల రావుకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు.
- సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట.
- ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది.
- విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది.
- కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు.
- రాధాకుమారి గారు తొలి చిత్రం తేనె మనసులు
రావి కొండలరావు నటుడిగా నటించిన చిత్రాల జాబితా
- కింగ్ (2008)- అతిథి పాత్ర
- మీ శ్రేయోభిలాషి (2007)
- నిన్నే ఇష్టపడ్డాను (2003)
- శ్రీ కృష్ణార్జున విజయం (1996)
- మేడమ్ (1993)
- బృందావనం (1992 సినిమా)
- పెళ్ళి పుస్తకం (1991)
- ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం(1991)
- చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
- సాహసం చేయరా డింభకా (1988)
- చంటబ్బాయ్ (1986)
- రుద్రకాళి (1983)
- మంత్రి గారి వియ్యంకుడు (1983)
- ఊరికిచ్చిన మాట (1981)
- రాధా కళ్యాణం (1981)
- సొమ్మొకడిది సోకొకడిది (1978)
- ఇదెక్కడి న్యాయం (1977)
- ఇల్లు - వాకిలి (1975)
- అందాల రాముడు (1973)
- దసరా బుల్లోడు (1971)
- శ్రీమంతుడు (1971)
- శ్రీకృష్ణ విజయం (1970)
- ప్రేమకానుక (1969)
- వరకట్నం (సినిమా) (1968)
- వింత కాపురం (1968)
- ప్రేమించి చూడు (1965 సినిమా)
- శోభ (1958 సినిమా)
నిర్మాత గా రావి కొండల రావు గారు
రచయితగా రావి కొండల రావు గారు
సాహిత్య రంగంలో పత్రికల్లలో రావి కొండల రావు గారు:
- ఇతడు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశాడు.
- హాస్యరచయితగా గుర్తింపు పొందాడు.
- సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశాడు.
రావి కొండల రావు రాసిన కొన్ని కథలు
- అనురాగం
- అభిప్రాయం
- అభిమాన పుస్తకం
- అసంభవామి యుగేయుగే
- ఆడదిక్కు
- ఆత్మహత్య
- ఆవు పులి
- ఇదీ ఓ కథే
- ఎదురుచూడని వరుడు
- ఏడో చేప
- కంగారూ కనకంగారూ
- కంపార్టుమెంటాలజి
- కనబడుట లేదు
- కబుర్లూ...
- కలం స్నేహం
- కలలో వినాయకుడు
- కోతితోక
- గయ్యాళి
- చంద్రశేఖరుని కథ
- చావుల కొండ
- చిక్కుడుకాయలూ...
- చిత్రఖేదం
- చిత్రమోదం
- చిత్రలాభం
- తప్పిపోయినాడు
- తెలుగుమాస్టారి స్వగతం
- తొందరపాటు
- తోడేలు-గొర్రెపిల్ల
- దాహంగల కాకి
- దిదృక్ష
- దొంగ
- నాణెం
- నిరుద్యోగ పర్వం
- నీతి
- నేరపరిశోధన
- పండితుడు-రాజు
- పాము-సన్యాసి
- పాలు-నీళ్లూ
- పిరికిపందలు
- భయంలేని వాడు
- భూత "గోస్ట్" కథ నేను సుబ్బారావుని
- మర్కటాలూ మిణుగురులూ
- మళ్లీ చెప్పిన కథ
- మాయమైన మనీపర్సు
- ముకుంద...
- ముక్తిమార్గం
- ముమూర్ష
- మూడు చేపలు
- రట్టూ గుట్టూ
- రామూర్తి పెళ్లయింది
- రెండు శవాలు
- రైలు పట్టాలు
- లంచగొండి-యమలోకం
- వాళ్లూ, నేనూ
- వ్యర్థపుటాశలు
- సంతుష్టి
- సన్మాన సభ
- సింహం-కుందేలు
- సుబ్బారావు సూర్యకాంతి
- స్థిరపడిన సంబంధం
రావి కొండల రావు రాసిన కొన్ని పుస్తకాలు
- (సి)నీతిచంద్రిక
- హ్యూమరథం (రెండు భాగాలు)
- మల్లీశ్వరి (సినిమా నవల)
- బ్లాక్ అండ్ వైట్
- రావి కొండలరావు నాటికలు
- రావి కొండలరావు కథలు
- నాగావళి నుంచి మంజీర వరకు
రావి కొండల రావు పొందిన పురస్కారాలు
- బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం (2004) లో పొందారు
- అ.జో-వి.భొ. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం
రావికొండల రావు మరణం
హైదరాబాదు బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020, జూలై 28వ తేదీన సాయంత్రం గం. 4.35 ని.లకు గుండెపోటుతో మరణించాడు. అతని ఆత్మకు శాంతి కలగాలని మనమందరం మనస్ఫూర్తిగా ప్రాద్దిద్దాం.
Note: